చిట్యాల సెప్టెంబర్ 25(ప్రజాజ్యోతి) ..//.. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల పట్టణంలోని శ్రీశ్రీశ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానము లో అమ్మవారి దసరా నవరాత్రోత్సవములకు హజరు కావాలని కోరుతూ తెలంగాణ శాసనమండలి చైర్మన్ గౌరవనీయులు గుత్తా సుఖేందర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య లను వారి వారి నివాసం కలిసి విజ్ఞప్తి చేశారు. చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి, ఉత్సవ కమిటీ చైర్మన్ శీలా సత్యనారాయణ, దౌలతాబాద్ వాసుదేవ శర్మలు కమిటీ సభ్యులతో కలిసి ఆదివారం ఆహ్వాన పత్రికను అందజేశారు.వారి వెంట ఆలయ అధికారి అంబటి నాగిరెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు గంజి వెంకటేశం, బుద్ధ విమల కృష్ణమూర్తి, సాయిరెడ్డి ప్రతాప్ రెడ్డి, జిట్ట శేఖర్, వరకాంతం నర్సిరెడ్డి, కౌన్సిలర్లు బెల్లి సత్తయ్య, కోనేటి కృష్ణ, నాయకులు పందిరి రమేష్, జిట్ట బొందయ్య,తదితరులు ఉన్నారు.
- 4 views