కొడంగల్, సెప్టెంబర్ 28(ప్రజాజ్యోతి).//...నవయుగ కవి చక్రవర్తి ప్రముఖ సంఘ సేవకుడు గుర్రం జాషువా జయంతిని కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని కోస్గి పట్టణం లోని గ్రంథాలయ ఆవరణలో బుధవారం నాడు జాతీయ బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తాలూకా బీసీ సంఘం అధ్యక్షులు మన్నె బస్వరాజ యాదవ్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అసమానతలు మూఢనమ్మకాలు మూఢాచారాలు ఇతివృత్తంగా ఎన్నుకొని తన కలం ద్వారా సమాజాన్ని జాగృతం చేసిన గొప్ప కవి జాషువా అని కొనియాడారు. జాషువా రచనలను నేటి యువత చదువుకొని సమాజ అభివృద్ధి కొరకు పాటుపడిన వలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో తాలూకా ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రభుదాస్ బహుజన సమాజ్ వాదు పార్టీ నాయకుడు చల్లా పురం నరసింహులు వెంకటయ్య హనుమానాయక్ గడుగు నర్సింలు బొంగు వెంకటయ్య రా సూరి కనకప్ప తదితరులు పాల్గొన్నారు
- 4 views