ప్రత్యేక ఆకర్షణగా మహిళల వస్త్రధారణ
బిబినగర్, సెప్టెంబర్ 11 (ప్రజా జ్యోతి) యాదాద్రి భువనగిరి జిల్లా బిబినగర్ మండలంలోని మగ్ధుపల్లి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని చివరి రోజున వినాయక నిమజ్జన శోభాయాత్ర అంగ రంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శోభాయాత్రలో మహిళలు ధరించిన వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం ఆర్గనైజర్స్ శ్రవణ్, సుధాకర్, గణేష్, వెంకటస్వామి, శ్రీను, జనార్దన్, సురేష్, మోహన్, భాను ప్రసాద్, శ్రీశైలం, భాను, భరత్, చిట్టు, శివ, మాజీ వార్డ్ మెంబెర్ జ్యోతి, చంద్రమ్మ, కలమ్మ, కవిత, నిర్మలా, సక్కు తదితరులు పాల్గొన్నారు.