సూర్యాపేట టౌన్ అక్టోబర్ 2 ప్రజా జ్యోతి./... అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞాన వెలుగులు ప్రసాదించే చల్లని తల్లి సరస్వతి దేవి అని ఒకటవ వార్డు కౌన్సిలర్ వేములకొండ పద్మ సైదులు అన్నారు .శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వార్డులో కొలువై ఉన్న అమ్మవారి విగ్రహం వద్ద చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఈ నవరాత్రి వేళలో అమ్మవారిని కొలుచుకోవడం వలన విజయాలు సాధిస్తారని పేర్కొన్నారు. సరస్వతి దేవి అవతారంలో భాగంగా అమ్మవారికి దవల వస్త్రాన్ని అలంకరిస్తారని ఈ దవల వస్త్రం మానసిక పరిపక్వతతో పాటు సకల విద్యలకు నిదర్శనమని పేర్కొన్నారు. అనంతరం వార్డులో హోమాన్ని నిర్వహించారు.
- 2 views