చౌడపూర్ మండల్ (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 20: వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్ర పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ టిపిసిసి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రతి గ్రామంలో డిజిటల్ ఇన్సూరెన్స్ కార్డులను పంపిణీ చేయాలని సూచించారు. చౌడాపూర్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు పెంటల చెన్నయ్య కొత్తపల్లి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎడ్ల మన్యంకొండ ఆధ్వర్యంలో కొత్తపల్లి గ్రామ ప్రజలకు డిజిటల్ మెంబర్షిప్ ఇన్సూరెన్స్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది. ఎస్ఎస్సి అధ్యక్షులు పెంటల చెన్నయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ప్రమాదవశత్తు ఏదైనా జరిగి మరణిస్తే వారికి 2లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వస్తుంది అని అన్నారు ప్రతి కార్యకర్తకు ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎడ్ల మన్యంకొండ, సతీష్, శ్రీకాంత్, కర్నే శ్రీనువాస్, దారమోని చెన్నయ్య, పుట్ట అంతయ్య, తుమ్మ కేశవులు, కావలి కృష్ణయ్య, సుర్క నర్సింలు, సతీష్,యాదయ్య మరియు గ్రామ పెద్దలు సీనియర్ నాయకులు యువకులు తదితరులు పాల్గొనడం జరిగింది.
- 3 views