- ఏరియా హాస్పిటల్ ఆకస్మికతనికి
ఫోటో రైటప్: హాస్పిటల్ ను అకస్మిక తనిఖీ చేస్తున్న ఎమ్మెల్యే నోముల భగత్
హలియా,సెప్టెంబర్30(ప్రజా జ్యోతి) : నాగార్జునసాగర్ ఏరియా హాస్పిటల్ ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. శుక్రవారం నాగార్జున సాగర్ కమల నెహ్రూ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి హాస్పిటల్ లో పనిచేసే అధికారుల బయోమెట్రిక్ హాజరు లేకపోవడంతో సంబంధిత అధికారులను మందలింఛారు.హస్పిటల్ లో నూతనంగా ఏర్పాటు చేయబోయే డయాలసిస్ గదిని పరిశీలించారు.హస్పిటల్ సంబంధిత అధికారులు,డాక్టర్ల ను సమయపాలన పాటించాలని కోరారు. హస్పిటల్ కు వచ్చే రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన వైద్యం అందించాలని కోరారు.అనంతరం హాస్పిటల్ కి వచ్చిన రోగులతో మాట్లాడి సరైన వైద్యం అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మ రెడ్డి, భూషరాజుల క్రిష్ణయ్య, సూపరిండెంట్ బాను ప్రకాష్, హాస్పిటల్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- 3 views