సూర్యాపేట టౌన్ 30 సెప్టెంబర్ (ప్రజా జ్యోతి) ./...అమ్మవారి ఆశీస్సులు, కరుణ కటాక్షం రాష్ట్ర ,జిల్లా ప్రజలపై ఉండాలని జిల్లా తెరాస నాయకులు శేనగాని రాంబాబు గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని 28వ వార్డులో ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూతెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి జిల్లా కోసం, జిల్లా ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఆయనకు శక్తిని ప్రసాదించి అండగా నిలవాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు శాలువతో సన్మానించారు.
- 1 view