భువనగిరి, సెప్టెంబర్ 27 (ప్రజా జ్యోతి).////. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరు కార్యాలయంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టరు పమేలా సత్పతి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు దీపక్ తివారీ, జిల్లా రెవిన్యూ అడిషనల్ కలెక్టరు డి.శ్రీనివాసరెడ్డి జ్యోతి వెలిగించి ఆచార్య బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వారు నిరంతరం పాటుపడ్డారని వారి ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మందడి ఉపేందర్ రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి యాదయ్య, జిల్లా ఎస్.సి. కార్పోరేషన్ ఇ.డి. శ్యాంసుందర్, జిల్లా ఎస్సి సంక్షేమ అధికారి జయపాల్రెడ్డి, జిల్లా పంచాయితీ అధికారి సునంద, జిల్లా మార్కెటింగ్ అధికారి సబిత, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి సత్యనారాయణ, కలెక్టరేటు పరిపాలన అధికారి ఎం.నాగేశ్వరా చారి, సామాజికవేత్త రామచంద్రయ్య, జాతీయ చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు రాపోలు వీరమోహన్, చేనేత సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, జిల్లా బి.సి. సంక్షేమ సంఘం అధ్యక్షులు రావుల రాజు, జిల్లా బి.సి. హక్కుల సాధన సమితి ప్రధాన కార్యదర్శి ఏశాల అశోక్, బి.సి. ఉద్యోగ సంఘం అధ్యక్షులు మాటూరు అశోక్, కొడాలి వెంకటేశ్, బండి జంగమ్మ, బి.సి. సంఘాల ప్రతినిథులు తదితరులు పాల్గొన్నారు.
- 4 views