దేవరకొండ- సెప్టెంబర్-24( ప్రజా జ్యోతి)..//. మండల కేంద్రంలోని శనివారం రోజున దొంతినేని నర్సింహారావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ తాడిశెట్టి నర్సింహా రావు అధ్యక్షతన కళాశాల జాతీయ సేవా పథకం యూనిట్1@2 ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గంప నాగేశ్వరరావు శిష్యుడు ఎన్ సుమన్ హాజరయ్యారు.ఆయన మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలో, మంచి పౌరులుగా వుండి సమాజ సేవ చేస్తూ జీవించాలని, మనం ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలని తెలియజేశారు.కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని, ఇతరులకు సాయం చేయాలని తెలియజేశాడు.ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకుడు ఈటూరు సుధీర్ కుమార్, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎం సంతోష్ కుమార్, అధ్యాపకులు పాండురంగయ్య, ఆంజనేయులు, ఉషారాణి, రెడ్యా, బాలరాజు ప్రేమానందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు
- 1 view