హైదరాబాద్ : శ్రీకాంత్, సునీల్ ప్రధాన పాత్రల్లో శ్రీ కార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీష్ గౌతమ్ ను హీరోలుగా పరిచయం చేస్తూ వి.విజయక్ష్మి, సుష్మా రెడ్డి ఫిలిమ్స్ సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్ పతాకంపై వి.సముద్రాల దర్శకత్వంలో వి. సాయి అరుణ్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం ’జై సేన’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటకి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ చిత్రం నుండి ’అనసూయ..అనసూయ’ లిరికల్ సాంగ్ను బుధవారం హీరో సుమంత్ విడుదలచేశారు. ’అనసూయ అనసూయ అనసూయా…గుండెజారి గల్లంతయ్యి ప్రేమలో పడిపోయా..అనసూయ అనసూయ అనసూయా..నీ అందం చూస్తే ఆడోళ్లందరికి అసూయ’ అంటూ హుశారుగా సాగే ఈ పాటను దనుంజయ్ ఆలపించగా సిరాశ్రీ సాహిత్యం అందించారు. ఎస్. రవిశంకర్ మంచి బాణీలు సమకూర్చారు. ఈ సందర్భంగా..హీరో సుమంత్ మాట్లాడుతూ ’సముద్రాల గారి దర్శకత్వంలో నేను, శ్రీహరి, అనుష్క కలిసి ’మహానంది’ సినిమా చేశాం.
ఇండస్ట్రిలో నాకు ఇష్టమైన దర్శకుల్లో సముద్రాల గారు ఒకరు. ఆయన దర్శకత్వం వహించిన జైసేన చిత్రంలోని అనసూయ..అనసూయ పాట చూశాను. చాలా బాగుంది. ఈ సినిమా దర్శకుడిగా సముద్రాల గారికి మరింత మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్‘ అన్నారు. చిత్ర దర్శకుడు సముద్రాల మాట్లాడుతూ ’సుమంత్ బాబుతో మహానంది సినిమా చేశాను. ఆ సినిమా కమర్షియల్గా మంచి విజయం సాధించింది. బాబుది చాలా మంచి మనస్తత్వం అందుకే నేను దర్శకత్వం వహించిన ’జైసేన’ సినిమాలోని అనసూయ పాటను బాబుతో విడుదల చేయించడం జరిగింది. ఈ పాటలో చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసిన శ్రీ కార్తికేయ నటించాడు. సినిమా బ్రహ్మాండంగా వచ్చింది. హీరోలు కొత్తవారైన చక్కగా నటించారు. వీరితో పాటు శ్రీకాంత్ అన్నయ్య, సునీల్, తారకరత్న, శ్రీరామ్, శ్రీ, పృథ్వి ఇలా చాలా మంది మంచి మంచి ఆర్టిస్టులు నటించారు. త్వరలో సినిమా విడుదల కాబోతుంది. విూ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని మసస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.