గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 29 : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ సమావేశం మందిరంలో గురువారం అలంపూర్, వడ్డేపల్లి, ఐజ మున్సిపాలిటీలకు సంబంధించిన కమిషనర్లు టౌన్ ప్లానింగ్ అధికారులు, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, ఫారెస్ట్, ఆర్టీసీ రవాణా శాఖ, మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులతో అధనపు కలెక్టర్ శ్రీహర్ష సమీక్ష సమావేశం నిర్వహించారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మున్సిపాలిటీల మాస్టర్ ప్లాన్ మార్చిలోపు పూర్తి చేయాలని, ఇందులో భాగంగా డిసెంబర్ వరకు ఆయా మున్సిపాలిటీ కమిషనర్లు, ఇతర శాఖ అధికారులు, వారి వివరాలు సమగ్ర సమాచారం అందజేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాద్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ నర్సింహారెడ్డి మాస్టర్ ప్లాన్ గురించి అన్ని శాఖల అధికారులకు సమగ్ర సమాచార నివేదికలు అందజేసేల స్క్రీన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ సత్యభామ, పురపాలక కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
- 2 views