కారేపల్లి మండలంలో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ విస్తుత పర్యటన.
కారేపల్లి, సెప్టెంబర్27, ప్రజాజ్యోతి:
వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ కారేపల్లి మండలంలో మంగళవారం విస్తుతంగా పర్యటించారు. జెత్రాం తండా, రంగురాళ్ళబోడు, చింతలతండా, సీతారాంపురం, బస్వాపురు, మడంపల్లి, గిడ్డవారిగూడెం, కారేపల్లి గ్రామాలలో పర్యటించి, బాధిత కుటుంబాలను. పరామర్శించి,కొంత ఆర్థిక సహయాన్ని అందించారు. అనారోగ్య బాధితులను పలకరించి, అండగా ఉంటాను, ధైర్యంగా ఉండాలని, అందరిని పలకరించారు. సీతారాంపురంలో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. టిఆర్ఎస్ కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సంధర్భంగా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సంస్కృతి కాపాడుతూ, గ్రామాల్లో బతుకమ్మ సంబురాలను వైభవంగా జరుపుకునేందుకు. ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారని తెలిపారు. మహిళలకు చీరల పంపిణీ చేయడమనేది దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ లేదని, తెలంగాణ లో మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయనిఆయన అన్నారు. కేసీఆర్ పాలన జనారంజకంగా సాగుతుందని, మహానేతకు అందరు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాల సంక్షేమం కోరి, అనేక పథకాలను ప్రవేశపెట్టారని, ప్రజలంతా వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా సంక్షేమాన్ని పట్టించుకోలేదని, కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు, రైతుభీమా పధకాలను పెట్టి రైతుల కష్టాలను తీర్చుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి వాంక్ డోత్ జగన్ నాయక్, మాజీ జెడ్పిటిసి ఉన్నం వీరేందర్, టిఆర్ఎస్ నాయకులు జడల వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు భూక్య చందు నాయక్, కారేపల్లి మసీద్ కమిటీ అధ్యక్షులు గౌస్ ఉద్దీన్, జడల కళ్యాణ్, రాజేష్, డొంకెన రవీందర్, వికాస్ తదితరులు పాల్గొన్నారు.
- 7 views