జమాల్ మృతికి కారణమైన సూదిగాడు వెంకట్ని కఠినంగా శిక్షించాలి.
ఆర్ఎంపిడబ్ల్యూఏ టిఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొమ్మినేని, బోయినపల్లి
బోనకల్, సెప్టెంబరు 21, ప్రజాజ్యోతి: జమాల్ సాహెబ్ మృతికి కారణమైన సూదిగాడు వెంకట్ని కఠినంగా శిక్షించాలని తెలంగాణ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుబొమ్మినేని కొండలరావు, బోయినపల్లి శ్రీనివాసరావులు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమాల్ సాహెబ్ మృతికి కారణమైన బండి వెంకట్ అనే వ్యక్తి ఆర్ఎంపీ వైద్యుడే కాదని, అతని ఏ ఒక్క యూనియన్ తో సంబంధాలు లేవని అన్ని యూనియన్లు ఇప్పటికే ముక్తకంఠంతో తెలిపాయన్నారు. గతంలో బండి వెంకట్ కొన్ని ప్రవేట్ ఆసుపత్రులతో పనిచేసి, ప్రస్తుతం జులాయిగా తిరుతున్నారన్నారు. వెంకట్ ఆర్ఎంపీ కాదని ప్రజలు, అధికారులు గమనించాలని పేర్కొన్నారు. పల్లెల్లో ప్రాణదాతలుగా నిలుస్తున్న ఆర్ఎంపీలను ఆసాంఘిక వ్యక్తులుగా ముద్ర పడే ఆవకాశముందన్నారు. కొంతమంది వ్యక్తుల చేసిన తప్పుడు దుర్మార్గమైన చర్యకు గ్రామాల్లో ఆర్ఎంపీలు ఆవేదన చెందుతున్నారన్నారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు మరీదు కిషోర్, షేక్ ఖాసీం, షేక్ హస్సేన్, జెడిమూర్తి, కె గోపి తదితరులు పాల్గొన్నారు.
- 5 views