గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 30 : జోగులంబ గద్వాల జిల్లా కేంద్రంలోని శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో, గుర్తుతెలియని వ్యక్తి వయస్సు దాదాపు 70 సంవత్సరాలు గద్వాల శ్రీరాం నగర్ రైల్వే స్టేషన్ల మధ్య, గద్వాల పాత హౌసింగ్ బోర్డ్ కాలనీ సమీపంలో ఎస్వీ ఈవెంట్ గార్డెన్ ఫంక్షన్ హాల్ వెనుక, రైలు పట్టాలపై కాచిగూడ వైపు నుండి రాయచూరు వైపు వెళ్లే గూడ్స్ రైలు కింద పడి చనిపోయాడు. మృతుడు తెల్లని ఫుల్ షర్ట్, తెల్లని ధోతి మరియు నీలం రంగు ఫుల్ డ్రాయర్ ధరించి ఉన్నాడు. గద్వాల పట్టణం లేదా చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వ్యక్తి అయి ఉండవచ్చును. మృతదేహం గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరచడమైనది. అతని ఆచూకీ తెలిసినచో, గద్వాల రైల్వే పోలీసు వారిని సంప్రదించగలరని రైల్వే హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ తెలిపారు.
- 2 views