- పరీక్షకు సరిగ్గా ప్రిపేర్ కాలేదంటు సాయి కిరణ్ తోటి విద్యార్థులతో ఆవేదన వ్యక్తం
- రూములోనే తన ఆధారాలను వదిలిన సాయికిరణ్
- సాయికిరణ్ కనబడటం లేదని కుటుంబ సభ్యులు నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
నల్లగొండ సెప్టెంబర్ 07,(ప్రజాజ్యోతి)ప్రతినిధి:నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం నార్కట్ పల్లి సమీపంలో ఉన్న కామినేని మెడికల్ కాలేజీలో చదువుకుంటున్న కొత్తగూడా నికి చెందిన గుండ బత్తిని సాయి కిరణ్ వయస్సు 21 తండ్రి మాలకొండయ్య సోమవారం నుండి కనపడటం లేదని కుటుంబ సభ్యులు కామినేని కళాశాల కు చేరుకొని ఆరా తీశారు. సాయి కిరణ్ నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలో ఓ ప్రైవేటు రూమ్లో కిరాయికి ఉంటూ తన చదువును కొనసాగిస్తున్నారు. సోమవారం తనతోపాటు ఉంటున్న విద్యార్థులను నాకు కొంచెం డబ్బు కావాలి ఇంటికి వెళ్తాను అని అడిగారు సగటు విద్యార్థులు మా దగ్గర లేవని తెలపగా సాయి కిరణ్ కాలేజీ కి వెళ్తున్న అని చెప్పి బయలుదేరాడు అప్పటినుండి సాయి కిరణ్ కనబడుటలేదు విద్యార్థులు సాయికిరణ్ తల్లిదండ్రులకు విషయం తెలిపారు. అనంతరం సాయి కిరణ్ కుటుంబ సభ్యులు నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.