తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాల సమీక్ష సమావేశం

Submitted by sridhar on Tue, 13/09/2022 - 19:43
Review Meeting of Telangana Unity Vajrotsavam

బచ్చన్నపేట సెప్టెంబర్ 13 ప్రజా జ్యోతి:తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సమీక్షా సమావేశం మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ భావాండ్ల నాగజ్యోతి కృష్ణంరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా వజ్రోత్సవాల స్పెషల్ ఆఫీసర్ విజయకుమార్ మాట్లాడుతూ. ఈనెల 16న నియోజకవర్గస్థాయి లో జాతీయ సమైక్యత ర్యాలీ ఉంటుందని.

అనంతరం రాష్ట్ర అభివృద్ధిపై ప్రసంగం ఉంటుందని. కావున మండలం నుండి స్వయం సహాయక సంఘాల సభ్యులు. అంగన్వాడీ టీచర్లు. ఆశా కార్యకర్తలు. ఏఎన్ఎంలు. మేధావులు ప్రజాసంఘాలు . ప్రజా ప్రతినిధులు. మండలంలోని అన్ని శాఖల ప్రభుత్వాధికారులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.తాసిల్దార్ బైరెడ్డి రాజేష్. ఎంపీడీవో రఘురామకృష్ణ. ఎస్ఐ నవీన్ కుమార్. మెడికల్ ఆఫీసర్ సిద్ధార్థ రెడ్డి. ఏపిఎం జ్యోతి. పి ఆర్ ఏ ఈ శ్రీనివాస్. గ్రామ కార్యదర్శులు. సర్పంచులు. ఎంపీటీసీలు. పలు శాఖల ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.