అక్టోబరు 04, ప్రజాజ్యోతి:
విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలందరికి అన్నింటా శుభం చేకూరాలని వేడుకున్నారు. లోక కంఠకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు, దుష్ట శక్తులపై దైవశక్తుల విజయానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకుంటున్నామని వివరించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని, ఎప్పటికైనా మంచిదే అంతిమ విజయమని మానవాళికి చాటి చెప్పిందని ఆయన తెలిపారు. దసరా పండుగలో మన సాంప్రదాయం, సంస్కృతితో పాటూ ఆత్మీయత ఉందన్నారు.జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు కలిగేలా దుర్గామాత దీవెనలు, ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.
- 16 views