గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) అక్టోబర్ 02 : జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో, ఆదివారం జాతిపిత మహాత్మా గాంధీ 153వ, జయంతి సందర్భంగా మల్దకల్ మండల వైస్ ఎంపీపీ పెద్ద వీరన్న గాంధీజీ చిత్రపటానికి పూలమాలవేసి, ఘనంగా నివాళులర్పించారు. వైస్ ఎంపీపీ వీరన్న మాట్లాడుతూ ప్రపంచం శాంతికి మార్గదర్శం అని, గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. దేశం అంతటినీ ఒకే తాటిపైకి తెచ్చి, స్వాతంత్రాన్ని అందించడంలో ప్రముఖ పాత్ర వహించి తన చివరి శ్వాస వరకు శాంతి, అహింస మార్గాలను ప్రచారం చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కృషి చేసిన వ్యక్తి అని, గ్రామపంచాయతీలు బాగుపడినప్పుడు దేశం బాగుపడుతుందని గ్రామాలు అభివృద్ధి చెందాలని స్వచ్ఛభారత్ ఆకాంక్షించారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కేసీఆర్ తో సాధ్యమవుతుంది. నేటి యువత గాంధీ ఆశయాలను కొనసాగించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యాకోబు, ఉపసర్పంచ్ సీకిన మలకల్ ఎంపీడీవో కృష్ణయ్య, ఏపీఓ సాంబశివుడు, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వెంకటన్న, కోఆప్షన్ నెంబర్ హైదర్ సాబ్, మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి, తెరాస పార్టీ నాయకులు నర్సింహారెడ్డి, మహేష్, భాస్కర్ గౌడ్, మధు, నరేందర్, కిష్టన్న, టిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- 3 views