నాగారం 2అక్టోబర్( ప్రజా జ్యోతి)./...మండల కేంద్రంలోని వర్ధమానుకోట బస్టాండ్ సమీపంలో కొలువై ఉన్న అమ్మవారి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం అమ్మవారి సన్నిధానంలో సామూహిక కుంకుమ అర్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. కుంకుమార్చన లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సరస్వతి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు మధుకర్, విక్రమ్ ,విజయ్, నవీన్ ,మల్లేష్, సాయి, హర్ష పాల్గొన్నారు.
- 3 views