నాగారం 30 సెప్టెంబర్( ప్రజా జ్యోతి) ./...నాగారం మండల కేంద్రంలోని డి. కొత్తపల్లి గ్రామపంచాయతీలో నూతనంగా మంజూరైన పింఛన్ స్మార్ట్ కార్డులను నాగారం వైస్ ఎంపీపీ గుంట కండ్ల మణి మాల లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...... తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు 50 లక్షల మంది వృద్ధులకు , వితంతువులకు దివ్యాంగులకు ,ఒంటరి మహిళలకు, ఆసరా పింఛన్లు అందజేస్తున్నారని తెలిపారు . అదేవిధంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. గిరిజన బంధు పథకం దేశంలో చారిత్రాత్మక ఘట్టమని అన్నారు.
- 1 view