ప్రజా జ్యోతి నాగారం 29 సెప్టెంబర్ ./.. దానాలలో కెల్లా అన్నదానం గొప్పదానమని సర్పంచ్ ఫసుపులేటి ప్రేమలత వెంకటరెడ్డి అన్నారు .గురువారం నాగారం మండలంలోని మాచిరెడిపల్లి గ్రామంలో మెయిన్ బజారులో జైభవానీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 6 వ వార్షికోత్సవం సందర్భంగా కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రేమలత మాట్లాడుతూకమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి ముందుకొచ్చిన కమిటి సభ్యులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో సోమరాజు ,శ్రీనివాస్ మున్న ,వీరమల్లు, వెంకన్న క్రిష్ణమూర్తి, లింగమల్లు, యాకన్న, అంజయ్య ,స్వామి తదితరులు పాల్గొన్నారు .
- 2 views