పెన్పహాడ్ మండలం అక్టోబర్ 02 (ప్రజా జ్యోతి): మండల పరిధిలోని చిన్నగారకుంట, గ్రామపంచాయతీ లో ఆదివారం గాంధీ జయంతి సందర్భంగా సర్పంచ్ శాలిబాయ్, మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శాలిభాయ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు గాంధీజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని అన్నారు. 153వ గాంధీ జయంతి సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీజీ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ ప్రయాణిస్తే విజయం తప్పదని చెప్పారు. జాతిపిత మహాత్మాగాంధీ సత్యాగ్రహం, అహింసా, శాంతి యుత పద్దతుల ద్వారా బ్రిటీష్ తెల్ల దొరల వలస పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్య సాధనకు చేసిన కృషి ప్రతి ఒక్కరికి ఆదర్శమని అన్నారు. ఓపికతో ఎంతటి సమస్య అయినా జాయించవచ్చు అన్నారు. గాంధీ మహాత్మ డు చూపిన మార్గం యావత్ జాతి ప్రజానీకానికి స్పూర్తి దాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తండా ప్రజలు వార్డు నెంబర్స్ గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- 1 view