మహాత్మా గాంధీ153 వ జయంతి

Submitted by Sathish Kammampati on Mon, 03/10/2022 - 11:45
మహాత్మా గాంధీ153 వ జయంతి

నల్లగొండ అక్టోబర్ (ప్రజాజ్యోతి) ./...జాతిపిత మహాత్మా గాంధీ153 వ జయంతి సందర్భంగా ఈ రోజు నల్లగొండ పట్టణం రామగిరి లోని గాంధీ పార్కులో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నల్లగొండ శాసన సభ సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్,ఈ సందర్భం గా నల్లగొండ శాసన సభ సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ మహానీయుల ఆశయాల బాటలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్వాతంత్ర్య సమర యోధులు, మున్సిపల్ కమీషనర్ డాక్టర్ కె.వి రమణాచారి, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.అనంతరం నల్లగొండ శాసన సభ సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్‌  చైర్‌ పర్సన్ మందడి సైదిరెడ్డి మహిళల మొబైల్ బయో టాయ్ లెట్స్ ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ గారు, మున్సిపల్ కమీషనర్ డాక్టర్ కె.వి.రమణాచారి గారు, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.