జవాద్ తుఫాన్ హెచ్చరికతో అప్రమత్తం
విశాఖలో కంట్రోల్ రూంల ఏర్పాటు
అమరావతి,డిసెంబర్ 3 : ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్గా మారి భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ, విపత్తు శాఖల హెచ్చరికలతో ప్రభుత్వం ముందస్తుగా కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. ఇప్పటికే మూడు జిల్లాలకు ముగ్గురు అధికారులను ప్రభుత్వం నియమించింది. విశాఖలోని కలెక్టరేట్లో ప్రజలకు అందుబాటులో అత్యవసర సేవలకు గాను కంట్రోల్ రూం నెంబర్లను ప్రకటించింది. 08912590100, 08912590102, 08912750089, 0891 2750090, 08912560820లకు ఫొన్ చేయాలని బాధితులకు సూచించింది. కాగా తాజా సమాచారం మేరకు జవాద్ తుఫాన్ విశాఖకు ఆగ్నేయంగా 420 కి. విూ దూరంలో, ఒడిశా గోపాల్పూర్కు 530 కి.విూ, పారాదీప్కు 650 కి.విూ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు ఉదయానికి ఉత్తర కోస్తాంధ్ర తీరానికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. గంటకు 25 కి.విూ వేగంతో ఉత్తర కోస్తాంధ్ర వైపు జవాద్ తుఫాన్ దూసుకొస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా ఉత్తర కోస్తాంధ్ర ఒడిశా తీరం వెంబడి గాలుల తీవ్రత పెరిగింది. శీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఓ వెూస్తారు నుంచి భారీవర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఈ జిల్లాలో 20 సెంటి విూటర్లకు పైగా అధిక వర్షపాతం నవెూదయ్యే అవకాశం ఉందని, లో తట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.