దేవరుప్పుల
అక్రమ కేసును రద్దు చేసి, వనకొండయ్య లక్ష్మీనరసింహస్వామి గుట్టను కాపాడాలి
అక్రమ కేసును రద్దు చేసి, వనకొండయ్య లక్ష్మీనరసింహస్వామి గుట్టను కాపాడాలి
దేవరుప్పుల, నవంబర్ 25, (ప్రజాజ్యోతి):-జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వాన కొండయ్య లక్ష్మీనరసింహస్వామి గుట్టకు అక్రమంగా మైనింగ్ పర్మిషన్ తెచ్చుకొని ఇటీవల రోహిత్ మినరల్ కంపెనీ అనే పేరుతో తవ్వకాలు జరిపారు అయితే ఆ సమయంలో ధర్మపురం కడవెండి మాదాపురం ఉమ్మడి గ్రామాల ప్రజలు మానకొండయ్య గుట్ట దగ్గరికి వెళ్లి అక్రమంగా చేస్తున్న మైనింగ్ను ఆపేశారు అయితే తర్వాత రోహిత్ మినరల్ కంపెనీకి చెందిన మొగిలి అనే వ్యక్తి కడవెండి గ్రామానికి చెందిన పోతిరెడ్డి లీనారెడ్డి, దుబ్బాక రత్నాకర్ రెడ్డి, కాశ బోయిన న
మంత్రి ఎర్రబెల్లి ని కలిసిన దేవరుప్పుల మండల గిరిజన నాయకులు
దేవరుప్పుల, సెప్టెంబర్ 20, (ప్రజాజ్యోతి):- ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటీవల జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవం 17 సెప్టెంబర్ న రాష్ట్ర లో ఉన్న గిరిజనలకు 10% రిజర్వేషన్, గిరిజన బంధు మరియు గిరిజనలకు సంస్కృతి సమావేశాలకు మరియు శుభాకార్యలకు నిర్వహించడం కొరకు సేవాలాల్ బంజారా భవన్, కొమురం భీమ్ భవన్, మరియు పాలకుర్తి నియోజకవర్గం పరిధిలో సేవాలాల్ మేరమా యాడి దేవాలయం నిర్మాణానికి ఒక ఎకరం భూమి ఇప్పించి గుడి నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయించినందుకు గాను మంగళవారం దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన ఆయా గ్రామాల గిరిజన నాయకులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును మర్యాదపూర్వకంగా కలిశా
వజ్రోత్సవాల సంబరాలు అంబరాన్ని అంటాలి: సుడిగెల హనుమంతు
దేవరుప్పుల సెప్టెంబర్ 16 ప్రజాజ్యోతి:- జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో గురువారం టిఆర్ఎస్ మండల పార్టీ అధికార ప్రతినిధి, కడవెండి గ్రామ మాజీ సర్పంచ్ సుడిగెల హనుమంతు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించారు.
వజ్రోత్సవాల సంబరాలు అంబరాన్ని అంటాలి: సుడిగెల హనుమంతు
దేవరుప్పుల సెప్టెంబర్ 15 ప్రజాజ్యోతి:- జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో గురువారం టిఆర్ఎస్ మండల పార్టీ అధికార ప్రతినిధి, కడవెండి గ్రామ మాజీ సర్పంచ్ సుడిగెల హనుమంతు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... .
దేవరుప్పుల బస్టాండ్ పై ఆర్టీసీ విజిలెన్స్ అధికారులు విచారణ
దేవరుప్పుల సెప్టెంబర్ 14, ప్రజాజ్యోతి:- దేవరుప్పుల మండల కేంద్రంలో గత 40 సంవత్సరాల క్రితం బస్టాండ్ నిర్మాణం కోసం ఓ వ్యక్తి భూమిని దానం ఇస్తే అందులో బస్టాండ్ నిర్మించారు. కాలక్రమేణా బస్టాండ్ నిరుపయోగంగా మారింది. ఇప్పుడు వారి వారసులు భూమిని లాక్కోవాలని చూస్తూ అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న విషయం తెలిసిందే అయితే, సోమవారం ఆర్టీసీ విజిలెన్స్ అధికారి రామ్మూర్తి బస్టాండ్ ను పరిశీలించి వాస్తవ నివేదిక అందజేస్తాం అని తెలిపారు. కాగా బుదవారం రామ్మూర్తి దేవరుప్పుల గ్రామపంచాయతీలో బస్టాండ్ కి సంబంధించిన అన్ని పత్రాలను సేకరించి పరిశీలించారు. వాసవికతపై పలువురిని విచారించారు.
కోళ్ల లోడు వాహనం బోల్తా, రూ.10 లక్షల నష్టం
దేవరుప్పుల సెప్టెంబర్ 14, ప్రజా జ్యోతి:- జనగామ జిల్లా దేవరుప్పుల మండలం దర్మగడ్డ తండా గ్రామం వద్ద బుధవారం తెల్లవారుజామున సిద్దిపేట నుండి అనకాపల్లి జిల్లా తుని గ్రామానికి కోళ్ల లోడుతో వెళ్తున్న AP03TA8174 నంబర్ గల డీసీఎం అదుపు తప్పి బోల్తా పడింది. దాదాపు రూ.10లక్షల నష్టం జరిగింది వారు తెలుపుతున్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రణ నష్టం జరగలేదు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
17న గిరిజన భవన్ ప్రారంభోత్సవానికి తరలిరండి
దేవరుప్పుల సెప్టెంబర్, 14 ప్రజాజ్యోతి:- జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో బుదవారం టిఆర్ఎస్ గిరిజన నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ గిరిజనుల ఆత్మ గౌరవం పెంచేలా ముఖ్య మంత్రి కేసిఆర్ ఆదివాసీ గిరిజన భవన్ నిర్మించడం అభినందనీయం అని అన్నారు. 17న ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ధరావత్ రామ్సింగ్, నవీన్ నాయక్, ఆయా గ్రామాల గిరిజనుల సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.
పాఠశాల విద్యార్థులకు టేబుల్ మేట్ లు బహుకరణ
దేవరుప్పుల సెప్టెంబర్ 14, ప్రజాజ్యోతి:- జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం గ్రామానికి చెందిన దుద్దుల ప్రభాకర్ అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు.వారి జ్ఞాపకార్ధంగా బుధవారం ప్రభాకర్ కూతుర్లు ప్రణీత, మౌనికలు కామారెడ్డిగూడెం గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థులకు 50 వేల రూపాయల విలువ గల టేబుల్ మేట్ లను బహుకరించారు. ఈసందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వై.శ్రీలత మరియు ఉపాధ్యాయులు వారిని అభినందించారు.ఈ కార్యక్రమంలో దుద్దుల పరుషరాములు, ఓడపెళ్లి రవీందర్, మహ్మద్ గులాం రసూల్, తదితరులు పాల్గొన్నారు.