ర్యాలీని జయప్రదం చేయండి

Submitted by bathula ravikumar on Tue, 04/10/2022 - 16:56
ర్యాలీని జయప్రదం చేయండి

ర్యాలీని జయప్రదం చేయండి                                   

 సుజాతనగర్ అక్టోబర్ 4 ప్రజాజ్యోతి. ఈ నెల 10 వ తారీఖున దళిత బంధు అమలు కొరకు బుడగ జంగం కులస్తుల ఆధ్వర్యంలో కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించే ర్యాలీని జయప్రదం చేయాలని బుడగ జంగం జిల్లా అధ్యక్షులు సిరిగిరి మురళి పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కమిటీ సమావేశం చింతలపూడి సత్యం భవన్ లో నిర్వహించారు ఈ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1500 కుటుంబాలు పలురకాల పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని వీరందరికీ దళిత బంధు అమలు డబుల్ బెడ్రూం ఇల్లు వంటి సమస్యలపై ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కు వినతి పత్రం అందజేస్తున్నమని తెలిపారు. ఈ ర్యాలీకి జిల్లా వ్యాప్తంగా ఉన్న జంగం కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి మారయ్య , టి. కోటయ్య పి. రామకృష్ణ , ఎన్. రామకృష్ణ , జి .శ్రీను తదితరులు పాల్గొన్నారు