సూది ముందు అపేరు వింటే బెంబేలెత్తిపోతున్న జనం
బోనకల్ ,సెప్టెంబర్ 23 ప్రజా జ్యోతి:
సూది మందు ఈ పేరు వింటేనే గ్రామాల్లో జనం భయపడిపోతున్నార.తాజాగా ఈ చర్చ విన్న ఓ విద్యార్థి తన ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటన నేలకొండ మండలంలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అజయ్ తాండాకు చెందిన గోపి ఇంటర్ చదువుతున్నాడు.రోజులాగా కాలేజీకి వెళ్లేందుకు ఆట ఎక్కాడు. ఆటలు ఆటో డ్రైవర్ తో పాటు మరో వ్యక్తి ఉన్నాడు. ఈ క్రమంలో వారు ఇటీవలే ముదిగొండలో జరిగిన సూది మందు ఘటన చర్చించుకోవడం జరిగింది.ఒంటరిగా ఉన్న నీలాంటి వాళ్లకి సూది వేయడం చాలా సులభమని గోపితో అనడంతో భయపడిన విద్యార్ధి ఆటో ఆపమని అనడంతో ఆటో అతను ఆపకుండా వెళ్లడంతో ఆందోళనకు గురైనా గోపి ఆటో లోనుంచి దూకేశాడు. అనంతరము గోపి వెళ్ళి తమ గ్రామస్తులకి తెలిపాడు. గ్రామస్తులు వచ్చెసరికి ఆటో అక్కడ నుంచీ వెళ్ళిపోవడం జరిగింది. ఆటోలో నుంచీ దూకిన గోపికి తీవ్ర గాయాలవ్వడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వరుసుగా సూది మందు ఘటనలు జరగడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ వారిని కోరుతున్నారు.
- 2 views