తెలకపల్లి, సెప్టెంబర్ 26 (ప్రజాజ్యోతి): మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ 127 వ జయంతిని రజక వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు పసుపుల రవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీపీ కొమ్ము మధు రజక సంఘం అధ్యక్షులు రవి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరీ విముక్తి కోసం ఆమె చేసిన పోరాటాలను కొనియాడారు కార్యక్రమంలో ఎంపీటీసీ రమేష్ ఉప సర్పంచ్ కృష్ణ రజక సంగం గౌరవ అధ్యక్షులు భోగరాజు బక్కయ్య బీఎస్పీ కోఆర్డినేటర్ శివశంకర్ రజక సంగం సభ్యులు నడిపయ్య, అబ్బాస్ శివ రాముడు నగేష్ రాము మరియు స్థానిక నాయకులు తెరాస స్థానిక అధ్యక్షులు భాషమోని సత్యం రైతు బంధు అధ్యక్షులు మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- 2 views