కలెక్టరేట్ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి కలెక్టర్శశాంక్
గాంధీ కి నివాళులర్పించిన హెచ్ పి ఏపీ ఎస్పి శరత్ చంద్ర పవర్
మహబూబాబాద్ బ్యూరో అక్టోబర్ 02 (ప్రజా జ్యోతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఉండగా మహబూబాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శశాంక గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగామహాత్మాగాంధీ జీ జయంతిని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయములో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అదేవిధంగా జాతిపిత మహాత్మా గాంధీ 153 వ జయంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీపార్క్ లో టిడిపి తెలంగాణ పార్లమెంటరీ అధ్యక్షుడు కొండపల్లి రామచంద్ర రావు, మహబూబాబాద్ మరియు ఇమామ్ టిడిపి రాష్ట్ర కార్యదర్శి మహాత్మా గాంధీ విగ్రానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యాగ్రహమే అయుధంగా అహింసా మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛా,స్వాతంత్ర్యాన్ని అందించిన జాతిపిత “మహత్మా గాంధీ” గారికి నివాళులు అర్పిస్తూ,జాతికి గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కారిక్రమంలో పట్టణ బీసీ సెల్ అద్యక్ష,కార్యదర్శి దామెదర్,రామమూర్తి నాయకులునారాయణ,నవీన్,రాజువెంకన్నలు పాల్గోన్నారు.
- 6 views