◆ పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు
గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 29 : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కె. ఎస్ ఫంక్షన్ హాల్ లో గురువారం అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్ల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు. బతుకమ్మ సంబరాలలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, కృష్ణమోహన్ రెడ్డి,గట్టు జెడ్పిటిసి బాసు శ్యామల, అంగన్వాడీ టీచర్లు ఆశ వర్కర్లతో పాటు బతుకమ్మ పాటలు, ఆటలు ఆడారు.
- 3 views