దేవరుప్పుల సెప్టెంబర్12, ప్రజాజ్యోతి:- రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని నెలలుగా వీఆర్ఏలు తహశీల్ధారు కార్యాలయాల ముందు నిరసన దీక్షలు చేపడుతుండగా అందులో భాగంగా ఈ రోజు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ హామీలు ఇవ్వని యెడల అసెంబ్లీ ముట్టడి చేస్తామని విఆర్ఏలు తెలిపగఅందుకు విఆర్ఏలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముట్టడికి సిద్దంగా ఉన్న దేవరుప్పుల మండల కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను ముందస్తుగా సోమవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేసి దేవరుప్పుల పోలీస్ స్టేషన్ కు తరలించారు.అరెస్టు అయిన వాళ్ళలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బోనగిరి యాకస్వామి, రెడ్డిరాజుల ఎల్లప్ప, ఇనుముల నాగరాజు, ఉప్పుల శ్రీకాంత్, తదితరులు ఉన్నారు.
- 2 views