మహదేవపూర్ సెప్టెంబర్ 23 ప్రజాజ్యోతి..//. మహదేవపూర్ డిగ్రీ కళాశాల లో బతుకమ్మ వేడుకలు శుక్రవారంనాడు ఘనంగా నిర్వహించారు. కళాశాల వరండాలో బతుకమ్మ ను ప్రతిష్టించి పాటలతో, నాట్యాలతో అలరించారు. అధ్యాపకురాలు రజిత మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పది కాలాల పాటు కాపాడుకోవలసిన అవసరం ఉందని అన్నారు , కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమము ఏర్పాటు చేసినా కళాశాల టీచింగ్ నాన్-టీచింగ్ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, రమేష్, డాక్టర్ రాజు, డాక్టర్ శ్రీనివాస్, వీ రమేష్, రాజేందర్, పరశురాములు, మున్నయ్య, రవీందర్, డాక్టర్ రాజన్న, వేణు, వెంకటయ్య, రజిత అస్ర , భాగ్యలక్ష్మి , రవీందర్ పాల్గొన్నారు.
- 2 views