గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 29 : జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆశ్విజ శుద్ధ చవితి గురువారం రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిచ్చారు. నిత్యాన్న దానేశ్వరి శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆధారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని, నిజక్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణాదేవి విరాజిల్లుతుంది. అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకున్న వారికి మంచి కలుగుతుందని పురోహితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ వాసవి సేవా సమితి జాతీయ అధ్యక్షుడు పూరి సురేష్ శెట్టి పాల్గొన్నారు. వీరికి ఆర్యవైశ్య సంఘం వారు శాలువాతో సత్కరించి, సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఇల్లూరి నాగరాజు పట్టణ అధ్యక్షుడు బాదం శ్రీనివాస్, జిల్లా వాసవి సేవా సమితి అధ్యక్షుడు మనసాని నాగరాజు, నరహరి వెంకటేష్ బాదం రాజు, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
- 1 view