అబద్దాలతో ఉద్యోగులను మోసం చేస్తున్న కెసిఆర్ : బిజెపి రాష్ట్ర నాయకులు ధన్పాల్ సూర్యనారాయణ

Submitted by SANJEEVAIAH on Tue, 04/10/2022 - 20:26
సరుకులు పంపిణీ చేస్తున్న ధన్పాల్ సూర్యనారాయణ

అబద్దాలతో ఉద్యోగులను మోసం చేస్తున్న కెసిఆర్

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దన్ పాల్ సూర్యనారాయణ

వీఆర్ఏలకు ఉచితంగా సరుకుల పంపిణీ

నిజామాబాద్ అర్బన్, ప్రజా జ్యోతి అక్టోబర్ 4 :

తమ హక్కుల కోసం ధర్నాలు చేస్తున్న విఆర్ఏలను రోడ్డుకు లాగిన ముఖ్యమంత్రి , మంత్రులు విలాసవంతమైన భవనాల్లో హాయిగా గడుపుతున్నరని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దన్ పాల్ సూర్యనారాయణ విమర్శించారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని దన్ పాల్ లక్ష్మీబాయి విరల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని విఆర్ఏలకు మంగళవారం ఉచితంగా బియ్యం ,నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ధన్ పాల్ సూర్యనారాయణ  మాట్లాడుతూ విఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి  పేస్కేల్ అమలు చేస్తామని, ఉద్యోగంలో చేరిన వెంటనే 13వేల వేతనాన్ని ఇచ్చి సమయానుసారం పెంచుతామని, మృతి చెందిన వీఆర్ఏల కుటుంబ సభ్యులకు వారి అర్హతలను బట్టి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, విద్యార్హతలు ఉన్న వారికి వారి అర్హతలను బట్టి ప్రమోషన్లు ఇస్తామని ముఖ్యమంత్రి 2017, 2022 సంవత్సరంలో ప్రకటించారని గుర్తు చేశారు. ఈ హామీలను తుంగలో తొక్కిన తెరాస ప్రభుత్వం 72 రోజులుగా సమ్మె చేస్తున్న వీఆర్ఏలను కనీసం మాట్లాడించిన పాపాన పోలేదని ద్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక పథకాలను తీసుకొచ్చి వాటి ఫలాలను ప్రతి పేదవాడికి అందేలా చూస్తుందని అన్నారు. రాష్ట్రంలో వీఆర్ఏల సమస్యలు తీర్చలేని ముఖ్యమంత్రి కేసీఆర్ దేశాన్ని ఏలుతానంటూ కొత్త జాతీయ పార్టీ పెడతానంటూ ప్రగల్బాలు పలుకుతున్నాడని ఎద్దేవా చేశారు.